కన్నడ నటి రన్యా రావుకు బెంగళూరు కోర్టు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఏడాది జైలు శిక్ష విధించింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం (COFEPOSA) కింద ఆమెకు ఈ శిక్ష ఖరారైంది. మార్చి 1, 2025న బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుండి 14.2 కిలోగ్రాముల బంగారం (దాదాపు ₹12.56 కోట్ల విలువ) స్మగ్లింగ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు రన్యా రావు పట్టుబడ్డారు. ఆమెతో పాటు ఆమె సహచరుడు తరుణ్ కొండూరు రాజు, జ్యువెలర్ సాహిల్ జైన్ కూడా ఈ స్మగ్లింగ్ రాకెట్ లో భాగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, రన్యా రావుకు బెయిల్ లభించదని, ఏడాది పాటు జైలులోనే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. COFEPOSA చట్టం కింద నిర్బంధం స్మగ్లింగ్ మరియు విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనలకు సంబంధించిన కేసులలో అనుమానం ఆధారంగా ఒక సంవత్సరం వరకు నిర్బంధానికి అనుమతిస్తుంది.
కన్నడ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష
